ETV Bharat / bharat

'ప్రభుత్వ విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు మాయం'

కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. మోదీ ప్రభుత్వ విధానాలు కోట్లాది ఉద్యోగాలు పోయేందుకు, జీడీపీ పతనానికి కారణమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వం దేశ యువత మాట వినేలా చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.

author img

By

Published : Sep 10, 2020, 2:27 PM IST

Rahul
ప్రభుత్వ విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు మాయం

మోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శల దాడి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఎన్​డీఏ సర్కార్ అవలంబిస్తున్న విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది గొంతు వినేలా మోదీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చేపట్టిన 'స్పీక్​ అప్​ ఫర్​ జాబ్స్'​ ఉద్యమంలో ప్రజలు భాగం కావాలని కోరుతూ ట్వీట్​ చేశారు రాహుల్​.

  • The policies of Modi Govt have caused the loss of crores of jobs and a historic fall in GDP.

    It has crushed the future of India’s youth. Let’s make the Govt listen to their voice.

    Join #SpeakUpForJobs from 10am onwards. pic.twitter.com/mRUooQ1yjX

    — Rahul Gandhi (@RahulGandhi) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ప్రభుత్వ విధానాలు కోట్లాది ఉద్యోగాలు కోల్పోయేందుకు, జీడీపీ చారిత్రక పతనానికి కారణమయ్యాయి. అది దేశ యువత భవిష్యత్తును దెబ్బతీసింది. వారు చెప్పేది ప్రభుత్వం వినేలా చేద్దాం.

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆరేళ్లలో 12 కోట్లు ఇచ్చేందుకు బదులు 14 కోట్ల ఉద్యోగాలను కోల్పోయేలా చేసిందని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ప్రస్తుతం యువత మేల్కొన్నారని.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారని చెప్పారు.

ఒకదాని తర్వాత ఒకటి చేపట్టిన అసమర్థ విధానాలతో కోట్ల మంది భారతీయుల జీవనోపాధిని భాజపా కొల్లగొట్టిందని, యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టిందని ఆరోపించింది కాంగ్రెస్​. 'స్పీక్ ​అప్​ ఫర్​ జాబ్స్​' ఉద్యమంలో భాగమై భాజపా దుస్సాహసాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి: 'కరోనా లాక్​డౌన్​ పేరుతో పేదలపై దాడి'

మోదీ ప్రభుత్వంపై మరోమారు విమర్శల దాడి చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ఎన్​డీఏ సర్కార్ అవలంబిస్తున్న విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు పోయాయని ఆరోపించారు. ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది గొంతు వినేలా మోదీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం చేపట్టిన 'స్పీక్​ అప్​ ఫర్​ జాబ్స్'​ ఉద్యమంలో ప్రజలు భాగం కావాలని కోరుతూ ట్వీట్​ చేశారు రాహుల్​.

  • The policies of Modi Govt have caused the loss of crores of jobs and a historic fall in GDP.

    It has crushed the future of India’s youth. Let’s make the Govt listen to their voice.

    Join #SpeakUpForJobs from 10am onwards. pic.twitter.com/mRUooQ1yjX

    — Rahul Gandhi (@RahulGandhi) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మోదీ ప్రభుత్వ విధానాలు కోట్లాది ఉద్యోగాలు కోల్పోయేందుకు, జీడీపీ చారిత్రక పతనానికి కారణమయ్యాయి. అది దేశ యువత భవిష్యత్తును దెబ్బతీసింది. వారు చెప్పేది ప్రభుత్వం వినేలా చేద్దాం.

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆరేళ్లలో 12 కోట్లు ఇచ్చేందుకు బదులు 14 కోట్ల ఉద్యోగాలను కోల్పోయేలా చేసిందని ఆరోపించారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. ప్రస్తుతం యువత మేల్కొన్నారని.. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారని చెప్పారు.

ఒకదాని తర్వాత ఒకటి చేపట్టిన అసమర్థ విధానాలతో కోట్ల మంది భారతీయుల జీవనోపాధిని భాజపా కొల్లగొట్టిందని, యువత భవిష్యత్తును చీకటిలోకి నెట్టిందని ఆరోపించింది కాంగ్రెస్​. 'స్పీక్ ​అప్​ ఫర్​ జాబ్స్​' ఉద్యమంలో భాగమై భాజపా దుస్సాహసాలకు వ్యతిరేకంగా గళం విప్పాలని పిలుపునిచ్చింది.

ఇదీ చూడండి: 'కరోనా లాక్​డౌన్​ పేరుతో పేదలపై దాడి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.